2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

Date:

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది వెండి ధర ఏకంగా 120 శాతం వరకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే కిలో వెండి ధర రూ. 2 లక్షలు దాటగా వచ్చే ఏడాది నాటికి ఈ ధర రూ. 2.5 లక్షలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

46 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ సంవత్సరం వెండి ధర దాదాపు 120 శాతం పెరిగింది. డిసెంబర్ 12 నాటికి దేశీయ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ. 2 లక్షలకు పైగా చేరింది. 1979 తర్వాత వెండి ధర ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే మొదటిసారి. ఇది 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

వచ్చే ఏడాది రూ. 2.5 లక్షలు?
విశ్లేషకుల అంచనాల ప్రకారం.. భవిష్యత్తులో కూడా వెండి ధర పెరుగుతూనే ఉంటుంది. రాబోయే సంవత్సరంలో వెండి ధర కిలోకు రూ. 2,40,000 నుండి రూ. 2,50,000 వరకు పెరగవచ్చు. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే వచ్చే ఏడాది సుమారు 25 శాతం పెరిగే అవకాశం ఉంది.

సౌరశక్తి రంగం: సౌరశక్తి రంగంలో వెండి డిమాండ్ గత నాలుగు సంవత్సరాలలో నాలుగు రెట్లు పెరిగింది. 2020లో సౌరశక్తి రంగంలో వెండి డిమాండ్ 94.4 మిలియన్ ఔన్సులుగా ఉండగా.. 2024 నాటికి ఆ డిమాండ్ 243.7 మిలియన్ ఔన్సులకు పెరిగింది.

పారిశ్రామిక, సౌరశక్తి రంగాలలో వెండి వినియోగం పెరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ విలువైన లోహం ధర మరింత పెరిగి రూ. 2.5 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...