
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్కు ముంబై ఇండియన్స్ తెరదించింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ఓడిపోవడం అనే సంప్రదాయాన్ని ఈసారి ముగించింది. 2013 నుంచి 2025 వరకు ముంబై జట్టు ప్రతి సీజన్లో తమ తొలి మ్యాచ్లో పరాజయం చవిచూస్తూ వచ్చింది. అయితే ఐపీఎల్ 2026లో కేకేఆర్పై విజయం సాధించి ఆ చెడు రికార్డును చెరిపేసింది.
ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026ను గెలుపుతో ప్రారంభించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్లో ముంబై చివరిసారిగా 2012లో తొలి మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2025 వరకు వరుసగా 13 సీజన్లలో ఓటములు చవిచూసింది. కానీ ఈసారి కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో గెలిచి ఆ చెత్త రికార్డుకు ముగింపు పలికింది.
ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలిచినా, ముంబై ఇండియన్స్కు మొదటి మ్యాచ్ మాత్రం ఎప్పుడూ కష్టంగా మారేది. 2012 నుంచి ఆ జట్టు ఇదే ట్రెండ్ను కొనసాగించింది. దీంతో అభిమానులు ‘మొదటి మ్యాచ్ దేవుడికి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించేవారు. అయితే తర్వాత ముంబై జట్టు పుంజుకుని టైటిల్ గెలవడం లేదా ప్లే ఆఫ్స్ చేరడం సాధారణమైంది. కానీ ఈసారి మాత్రం తొలి మ్యాచ్లోనే ఘన విజయం సాధించి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపింది. కేకేఆర్ ఇచ్చిన 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించి అదిరిపోయే ప్రదర్శన చేసింది.

