“రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి”.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!

Date:

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

తాజాగా ఇరాన్‌లోని అత్యంత ముఖ్యమైన చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపంపై వరుస దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఇరాన్‌కు గడువు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువుకు కొద్ది క్షణాల ముందు ఈ దాడి జరిగింది. మరోవైపు ఇరాన్‌కు ఇచ్చిన గడువులోగా టెహ్రాన్‌ను నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. సోషల్ ట్రూత్ అనే వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో, మంగళవారం రాత్రి (ఏప్రిల్ 7, 2026) ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడం ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. తాను ఇలా చేయాలని కోరుకోలేదని, కానీ అలా చేయక తప్పడం లేదని ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు.

ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది. రాబోయే 48 గంటల పాటు భారత పౌరులు ఉన్నచోటనే ఉండాలని కోరింది. ‘భారత రాయబార కార్యాలయం బుక్ చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు లోపలే ఉండాలి. అక్కడ ఉన్న రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలి’ అని ఆ సలహాలో పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...