జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాల్లో బలమైన జనసేన నేతలను ఎంపిక చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండి, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు సమాచారం.

