వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్

Date:

విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి, వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన వేదిక అని చాటి చెప్పారు. గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికారు.. ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. ఇవాళ కూడా భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు

విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర కొనసాగుతోంది.. సాగర తీర నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. గత రెండు రోజులుగా రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...