Andhra: మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం పని చేశాడో తెలుసా..?

Date:

మృతదేహాన్ని ఇంటికి తరలించే బాధ్యతలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. మార్గమధ్యలో మృతురాలి కుమారుడిని నీళ్లు తీసుకురావాలని పంపించి, ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు. పోలీసుల విచారణలో నిందితుడు పట్టుబడగా, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఓ అంబులెన్స్ డ్రైవర్ చేసిన నీచమైన పని కడప జిల్లాలో కలకలం రేపింది. ఆస్పత్రిలో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్న సమయంలో ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మార్గమధ్యలో వాహనాన్ని ఆపాడు. అంబులెన్స్‌లో ఉన్న మృతురాలి కుమారుడిని మంచినీటి బాటిల్ తీసుకురావాలని చెప్పి కిందకు పంపినట్లు సమాచారం. ఆ సమయంలో మృతురాలి చేతికి ఉన్న రెండు బంగారు గాజుల్లో ఒక గాజును చాకచక్యంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్ద దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బంగారు గాజు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో అంబులెన్స్ డ్రైవర్‌నే నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని తరలించే బాధ్యతలో ఉన్న వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవత్వాన్ని మరిచి చేసిన ఈ చర్యపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....