Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..

Date:

నీట్ (NEET) పరీక్షల నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన నిరసనలను కొందరు దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాల కోసం దారి మళ్లించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని పవన్ సూచించారు. అయితే ప్రజాస్వామ్య నిరసన పేరుతో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు తాను మద్దతు ఇస్తానని, కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే, జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా రంగంలో కీలక మార్పులు వస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ‘నేషన్ ఫస్ట్’ భావనతో దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....