
నీట్ (NEET) పరీక్షల నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన నిరసనలను కొందరు దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాల కోసం దారి మళ్లించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని పవన్ సూచించారు. అయితే ప్రజాస్వామ్య నిరసన పేరుతో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు తాను మద్దతు ఇస్తానని, కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే, జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా రంగంలో కీలక మార్పులు వస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ‘నేషన్ ఫస్ట్’ భావనతో దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.

