Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..

Date:

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే మూడ్రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..

సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన ప్రాంత కేంద్రం, గుణ, సిద్ధి, డాల్టన్‌గంజ్ మీదుగా వెళ్లి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు విస్తరిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వానలు కురవనున్నాయని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి  దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు వానలు పడతనున్నాయి. అటు రాగల 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 -4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...