Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా

Date:

Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు..

Massive Scam: టీచర్ ఉద్యోగం చేశాడు .. మంచిగా ఉంటాడులే అని నమ్మితే ఆ మంచితనాన్ని అడ్డంపెట్టుకుని … అందరినీ ముంచాడు. 70 మంది వద్ద 7 కోట్లకు టోకరా పెట్టాడు. అంతే కాకుండా వారందరికీ ఐపి నోటీసులు కూడా పంపించాడు ఆ ప్రభుద్దుడు . ఇంతకీ విషయం ఏమిటంటే. కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు కూడా అతనిని నమ్మి చిట్టీలు వేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బ స్వాహా చేసి ఇంటుకి తాళం వేసి పరారయ్యాడు.

అంతే కాక తాను డబ్బులు ఎగ్గొట్టిన వారికి చక్కగా ఐపీ నేటీసులు కూడా పంపించాడు. దీంతో ఖంగు తిన్న బాదితులు పులివెందుల పోలీసులను ఆశ్రయించారు. మొత్తం బాదితుల వద్దనుంచి ఇప్పటి వరకు 7 కోట్లు స్వాహా చేసినట్టు సమాచారం. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి టీచర్ అని నమ్మినందుకు మొత్తానికి గుండుగీకాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...