ఏపీలో 2 కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ఎల్ అండ్ టీకి అమరావతి ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం.. కేబినెట్ నిర్ణయాలివే!

Date:

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 34 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుతోపాటు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026, పాదచారుల భద్రత పాలసీ, అమరావతి అభివృద్ధి, విద్య, పరిశ్రమలు, చట్ట సంస్కరణలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 34 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధి, విద్య, పరిశ్రమలు, మౌలిక వసతులు, చట్ట సంస్కరణలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని అమరావతి అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ.1,002.49 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అదనంగా అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ భవనాల డిజైన్ల పూర్తి కోసం అదనపు నిధుల కేటాయింపుకు అంగీకారం తెలిపింది.

అమరావతి భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎం) చేసిన సిఫార్సులను ఏపీ కేబినెట్ ఆమోదించింది. అలాగే ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లు నిర్వహించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 ముసాయిదాతో పాటు ఏపీ పీపీపీ పాలసీ-2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ భూముల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు.. రాయితీ విద్యుత్ అందించేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. వీటి స్థానంలో ప్రజల భద్రత, భూముల రక్షణకు మరింత సమర్థవంతమైన కొత్త చట్టాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యను విస్తరించే లక్ష్యంతో 2 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్త జిల్లాల్లో విద్యా పరిపాలనను బలోపేతం చేయడానికి 15 కొత్త జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పోస్టుల సృష్టికి కూడా ఆమోదం తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...