కొత్త ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంటికి విద్యుత్ సరఫరా అనేది అవసరం. దీంతో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో దళారులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మీరు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సొంతింటి కల అనేది ప్రతీఒక్క సామాన్యుడి చిరకాల కోరిక. ఈ కలను నెరవేర్చుకునేందుకు కాయా కష్టం చేస్తుంటారు. తమ కష్టార్జితాన్ని కూడబెట్టుకుని సొంతిల్లు నిర్మించుకుంటారు. అయితే కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ అనేది అవసరం. ఇందుకోసం కొత్త కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలి. కొత్త విద్యుత్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి..? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలియక ఆందోళన పడుతుంటారు. దళారులను ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు చేసుకుంటారు. అయితే దళారుల అవసరం లేకుండా మీరే సులభంగా కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- చిరునామా రుజువు
- ఇంటి యాజమాన్య పత్రం లేదా అద్దె ఒప్పందం
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- అవసరమైతే భవన అనుమతి లేదా ఇతర స్థానిక పత్రాలు
ఫీజు ఎంత ఉంటుంది?
కొత్త విద్యుత్ కనెక్షన్కు చెల్లించాల్సిన ఫీజు రాష్ట్రం, కనెక్షన్ రకం (డొమెస్టిక్/కమర్షియల్), అవసరమైన విద్యుత్ లోడ్ ఆధారంగా మారుతుంది. ఇందులో దరఖాస్తు ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు ఉండవచ్చు. ఖచ్చితమైన మొత్తం సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
దరఖాస్తు తర్వాత ఏం జరుగుతుంది?
దరఖాస్తు పరిశీలించిన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు అవసరమైతే స్థల పరిశీలన నిర్వహిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే కనెక్షన్ ఆమోదించి మీ ఇంటికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుంది.
గమనిక: కొత్త విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన ఫీజులు, ప్రాసెసింగ్ సమయం, నిబంధనలు రాష్ట్రాల వారీగా మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు మీ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక వెబ్సైట్లో తాజా వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి.
ఛార్జీలు ఇవే..
తెలంగాణలో కొత్త గృహ విద్యుత్ కనెక్షన్ కోసం 1 kW వరకు కనెక్షన్లకు రూ.500 స్థిర రుసుము చెల్లించాలి. ఇక 1 kW నుండి 5 kW వరకు ఉన్న కనెక్షన్లకు రూ.500తో పాటు ప్రతి అదనపు కిలోవాట్కు రూ.600 చొప్పున వసూలు చేస్తారు. ఇక ఏపీలో గృహ వినియోగదారులు మొదటి కిలోవాట్కు రూ.1,500, కమర్షియల్వి నియోగదారులు రూ.1,800 చెల్లించాలి. ఆపై ప్రతి అదనపు కిలోవాట్కు రూ.2,000 చొప్పున 20 కిలోవాట్ల వరకు ఛార్జీలు వర్తిస్తాయి.

