గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె హఫీసా బేగం (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో హఫీసా బేగం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరికొందరికి కూడా తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విజయవాడ, ఆగస్ట్ 10: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె హఫీసా బేగం (24) మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆమె స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు.
కారులో తాడేపల్లికి చెందిన జిమ్ నిర్వాహకుడు ఉండి రుత్విక్తో పాటు అవినాష్, సుధీర్, షేక్ ఆసిఫా, వంశీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో హఫీసా బేగం అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.
గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ.. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ కొనసాగిస్తున్నారు.
హఫీసా బేగం తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు వెళ్తున్న లారీ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న డివైడర్ను తాకి ఆగిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆసిఫా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు.

