ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు

Date:

ఏపీ ప్రభుత్వం 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (Recognition of Service Associations) Rules, 2001 లోని రూల్ 3(2)(e) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 29 ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించారు. ఒకేసారి 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాల కొన్నేళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు.. అందుకే ఆ ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సర్వీస్ అసోసియేషన్ల గుర్తింపు) నిబంధనలు, 2001 — రూల్ 3(2)(e) కింద గుర్తింపును రద్దు చేశారు.

1. అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్
2. ఏపీ యునాని మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్
3. ఆంధ్రప్రదేశ్ సచివాలయ రికార్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్
4. ఏపీ సచివాలయ క్లాస్-IV ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్
5. ఏపీ సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్
6. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్
7. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్
8. ఏపీ విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్
9. ఏపీ గ్రామ పంచాయతీల ఎగ్జిక్యూటివ్ (గెజిటెడ్) అసోసియేషన్
10. ఏపీ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కోచింగ్ స్టాఫ్ అసోసియేషన్
11. ఏపీ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ (గెజిటెడ్) సర్వీస్ అసోసియేషన్
12. ఏపీ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీస్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్
13. ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్
14. ఇరిగేషన్, లాక్స్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్స్ అసోసియేషన్
15. ‘ద ఏపీ సర్వే ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’
16. ‘ద అసోసియేషన్‌ ఆఫ్‌ హానరరీ మెడికల్‌ ఆఫీసర్స్‌-ఏపీ’
17.. ‘ద పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌’
18.‘ద ఏపీ పోలీస్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’ వంటి మొత్తం 29 సంఘాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏపీపీటీడీ (ఆర్టీసీ) జేఏసీ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ నాయకులు ఏపీ జేఏసీని కలిశారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్, ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు బస్సులను ఆర్టీసీకి తీసుకురావడం మంచిదేనని.. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బందితో నడపాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...