
ముంబైలోని కుర్లా-ఘాట్కోపర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరాగ్ నగర్ పరిధిలోని గౌసియా చావ్ల్పై భారీగా కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మరోవైపు, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వాణిజ్య రాజధాని ముంబైలోని కుర్లా–ఘాట్కోపర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి నుంచి ఐదుగురు వరకు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), ముంబై ఫైర్ బ్రిగేడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘోర ప్రమాదం బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఘాట్కోపర్లోని చిరాగ్ నగర్ పరిధిలో ఉన్న గౌసియా చావ్ల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
కొండలోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలి గౌసియా చావ్ల్పై పడటంతో రెండు నుంచి మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు నిద్రలో ఉండటంతో పలువురు ఈ ఘటనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక, గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

