ఆ గ్రామంలో ఒక్కో ఓటుకు రూ. 20 వేలు.. ఇప్పటివరకు ఇదే రికార్డ్

Date:

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని నర్కూడ గ్రామంలో.. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల ఆ గ్రామానికి ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా.. గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలి

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్నారు మహాత్మ గాంధీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆ గ్రామాలే పునాది. గ్రామం స్వయం సమృద్ధి సాధిస్తేనే.. దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ గ్రామ పాలనలో అత్యంత ప్రధానమైనవి గ్రామపంచాయతీ ఎన్నికలు. ఈ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులది.. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర. వారు సమర్థంగా పనిచేస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర గుర్తులతో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...