
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
జాతీయ జెండాలు, పుష్పాలంకరణలతో టీడీపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

