ఈ తాత మామూలోడు కాదు.. 72 ఏళ్ల వయస్సులో సాహసం.. 5642 మీటర్ల మంచు శిఖరం అధిరోహణ!

Date:

వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు. 72 ఏళ్ల వయసులో యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 5,642 మీటర్ల ఎత్తైన ఈ మంచు శిఖరాన్ని ఆగస్టు 14న తన 17 ఏళ్ల మనవడు పోకూరి అనురాగ్‌తో కలిసి అధిరోహించారు.

తాతా, మనవడు కలిసి ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌తో పాటు ఈస్ట్‌ పీక్‌ను కూడా అధిరోహించడం విశేషం. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో రవీంద్రరావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

72 ఏళ్ల వయసులోనూ మంచు పర్వతాన్ని అధిరోహించేంత ఫిట్‌నెస్‌ కొనసాగించడం అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే వయసుతో సంబంధం లేకుండా సాహసాలు చేయవచ్చని రవీంద్రరావు నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు.

మరో విశేషం ఏమిటంటే.. అనురాగ్‌ ప్రముఖ నిర్మాత, ఈతరం ఫిల్మ్‌ అధినేత పోకూరి బాబూరావు మనవడు. తాత, మనవడు కలిసి చేపట్టిన ఈ సాహసయాత్ర పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...