ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుల చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే పని లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త తొలగింపుపై వినతులు ఇచ్చేందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. ఇంట్లోనే నుంచే ఈ పనులు పూర్తి చేయొచ్చు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు, అధికారుల్ని కలవాల్సిన పనిలేదు.

ప్రతి ఇంటి గోడకు, డోర్‌కు క్యూఆర్ కోడ్‌ను అంటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్యూఆర్ కోడ్‌ సాయంతో స్కాన్‌ చేసి ఆస్తి పన్ను చెల్లింపులతో పాటుగా సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు.. త్వరలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు మున్సిపల్, కార్పొరేషన్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వం ఇస్మార్ట్ ఆలోచన చేసింది. ఇప్పటికే పురమిత్ర యాప్‌ ప్రజలకు అందుబాటులో ఉంది. ఆ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యల్ని ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తే చాలు పరిష్కరిస్తారు.

ఈ యాప్‌కు ప్రజల నుంచి ఇప్పుడే ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఆస్తిపన్ను సహా ఇతర సేవలు అందించేందుకు కొత్తగా క్యూఆర్ కోడ్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్యూఆర్ కోడ్‌లను మొత్తం 45 లక్షల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలకు అతికించనున్నారు.

అంతేకాదు వారిని సంప్రదించేందుకు వీలుగా మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కేంద్రం దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిటీ సర్వీస్‌ సెంటర్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందుకే క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ప్రాజెక్టును ఏపీలో కూడా తీసుకొస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....