భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో బద్దలయిన రికార్డులు ఇవే.. 5 పరుగులు చేసుంటే వరల్డ్‌కప్ చరిత్రే మారిపోయేది!

Date:

ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026లో భారత్ జింబాబ్వేపై 256/4 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అబిషేక్ శర్మ అర్ధశతకం, హార్దిక్ పాండ్యా అజేయ ఫిఫ్టీతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మొత్తం 17 సిక్సర్లు బాది ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ స్కోర్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధికంగా నిలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్ ఆశలను బలపరుచుకుంటూ, రికార్డుల పేజీల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

సౌతాఫ్రికాపై ఎదురైన ఘోర పరాజయం మరిచిపోయేలా జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 8 కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చి చెన్నై చెపాక్ స్టేడియంలో రికార్డుల మోత మోగించారు. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 256/4 పరుగులు చేసి వరల్డ్‌కప్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మరో ఐదు పరుగులు చేసుంటే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచేది.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు, ఈ మ్యాచ్‌లో 17 సిక్సర్లు బాదింది. ఇంకొక్క సిక్స్ బాదుంటే, శ్రీలంక 2007లో చేసిన రికార్డును కూడా చెరిపేసేది. ఈ ఘన విజయానికి ప్రధాన కారణం యువ అభిషేక్ శర్మ. ఇటీవల వరుసగా డకౌట్లతో ఫామ్ కోల్పోయిన అతడు, ఈ మ్యాచ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. సంజూ శాంసన్‌తో 48 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం, ఆ తర్వాత ఇషాన్ కిషన్‌తో 72 పరుగుల జోడీతో భారత్‌కు పటిష్టమైన ఆరంభం అందించాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...