తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఏడాదిలోగా అందుబాటులోకి, చురుగ్గా పనులు

Date:

వరంగల్ నగర ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా నగరం నుంచే రాకపోకలు సాగించొచ్చు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు డీపీఆర్ సిద్ధం కాగా.. త్వరలోనే కేంద్రం ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత ఏడాదిలోగా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తు్న్నారు.

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటే పౌరులకు సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించారు. వరంగల్ మామునూరు, రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు డీపీఆర్‌ సిద్ధంగా కాగా.. అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొద్ది రోజుల్లోనే డీపీఆర్‌కు ఆమోదం లభించే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై ఏడాదిలో పనులు పూర్తి చేసి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా వంటి పెద్ద పెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేను మూడు కి.మీ.మేర పొడిగిస్తారు. ప్రయాణికుల టెర్మినల్, కార్గో సౌకర్యం, సెక్యూరిటీ వ్యవస్థలు, పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఎయిర్‌పోర్టులో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...