Andhra: వాయమ్మో.. 30 అడుగుల బావిలో పడిన మహిళ.. బయటకు ఎలా వచ్చిందంటే..

Date:

ఏలూరు జిల్లా నూజివీడు బొందిలిపేటలో 30 అడుగుల లోతైన బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన మహిళను పోలీసులు, స్థానికుల సహకారంతో సురక్షితంగా బయటకు తీశారు. జిల్లా శైలజ అనే మహిళ ఇంటి ముందు ఉన్న బావి వద్దకు వెళ్లిన సమయంలో అదుపుతప్పి బావిలో పడిపోగా, ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఏలూరు : ఊరులోని జనాలంతా ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉండగా.. ఒక పెద్ద అరుపు అందరిని ఉలిక్కి పడేలా చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆర్తనాదం అని అందరూ దిక్కులు చూసారు. ఆ కేకలు వినిపిస్తున్న వైపుకు అందరూ పరుగులు తీసారు. బావిలో ఒక మహిళా పడి పోయింది. కాపాడమంటూ కేకలు పెడుతోంది. ఈ ఘటన నూజివీడు బొందిలిపేట వీధిలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన జిల్లా శైలజ అనే మహిళ తన ఇంటి ముందే ఉన్న బావి వద్దకు వెళ్లిన తరుణంలో, అదుపుతప్పి ఒక్కసారిగా 30 అడుగుల లోతు ఉన్న చీకటి బావిలోకి ఆమె పడిపోయింది. వెంటనే ఆమె ప్రాణభయంతో కేకలు పెట్టింది. బావిలో నుండి వస్తున్న ఆమె కేకలతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సరిగ్గా అదే సమయంలో, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అప్రమత్తమయ్యారు.

క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయే అవకాసం ఉండటంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. 30 అడుగుల లోతు, ఊపిరాడని పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది. కానీ పోలీసు అత్యంత చాకచక్యంగా రక్షణ చర్యలు అమలు చేశారు. ఫోన్ కాల్ వచ్చిన అతి తక్కువ సమయంలోనే, మృత్యువుతో పోరాడుతున్న ఆ మహిళను రక్షించేందుకు స్థానికుల సహకారంతో కాలంతో పోటీ పడ్డారు. శ్వాస బిగపట్టి చూస్తున్న జనసందోహం మధ్య, పక్కా ప్రణాళికతో బావిలోకి దిగి, చివరకు ఆ మృత్యు కూపం నుండి శైలజను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

ఆమె క్షేమంగా బావి పైకి రాగానే, ఆమె బంధువులతో పాటు అక్కడ చేరిన వారి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. అంతటి ఘోర ప్రమాదం జరిగినా, ఒంటిపై చిన్న గీత కూడా పడకుండా శైలజ సురక్షితంగా బయటపడటం చర్చనీయాంశంగా మారింది. చావు అంచుల దాకా వెళ్లిన ప్రాణాన్ని, సమయస్ఫూర్తితో వ్యవహరించి నిమిషాల వ్యవధిలో కాపాడిన టౌన్ ఎస్సై నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, చొరవ చూపిన మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణల ను పలువురు అభినందించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...