టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు

Date:

టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిగా పార్టీ కార్యకర్తల్ని నియమించారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి వ్యవస్థను నియమించారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా కుటుంబ సాధికార సారథిగా నమోదయ్యింది. చంద్రబాబు పేరును చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేయడం విశేషం. కడపల్లె పంచాయతీలో చంద్రబాబు కూడా సాధారణ కార్యకర్తలా టీడీపీ కుటుంబ సాధికార సారథిగా బాధ్యతల్లో ఉన్నారన్నమాట.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని కడపల్లె పరిధి శివపురంలో నివాసాన్ని నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును కూడా కడపల్లె పంచాయతీలో టీడీపీ తరఫున ప్రతినిధిగా కుటుంబ సాధికార సారథి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. చంద్రబాబుకు తిమ్మరాజు పల్లె పోలింగ్ బూత్ నంబర్ 49లోని 181 నుంచి 240 వరకు ఉన్న 60మంది ఓటర్లకు కుటుంబ సాధికార సారథి వ్యవహరిస్తారు. అక్కడి ఓటర్లను కలిసి కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, ఎలా లబ్ధి పొందారు, పెండింగ్‌ సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు చంద్రబాబు కుటుంబ సాధికార సారథిగా ఇప్పటికే ఓటర్లను ఒకసారి కలిశారు. గతేడాది జూలై 2న తిమ్మరాజుపల్లెలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిప్రాయాలను సేకరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...