ఢిల్లీతో పోరాడండి.. మీ వెంట మేమున్నాం”: మమతా బెనర్జీకి బంగ్లా మంత్రి సంచలన మద్దతు

Date:

పశ్చమి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓటు హక్కును కాలరాశారంటూ.. బంగ్లాదేశ్ ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ విషయంలో తాము తలదూర్చమని చెబుతూనే.. బెంగాల్ ఓట్ల తొలగింపు తమ దేశంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మమతా బెనర్జీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని.. కానీ తమ మద్దతును కోల్పోలేదని చెప్పారు. ఆమె కచ్చితంగా ఢిల్లీతో పోరాటం చేయాలని.. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల మంది ముస్లిం ప్రజలు ఆమె వెనుకే ఉన్నారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకంపనలు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌కు చేరాయి. బెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మైనారిటీల పరిస్థితిపై బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత, ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది మంది ముస్లింలు, మతువా కమ్యూనిటీ ప్రజల ఓటు హక్కును అన్యాయంగా హరించారని ఆయన ఆరోపించారు. అలాగే తాము మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఆమె న్యాయ పోరాటం చేయాలని.. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల ముస్లిం సోదరులు ఆమె వెనుకే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.

భారత్ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని చెబుతూనే.. సరిహద్దు రాష్ట్రమైన బంగ్లాదేశ్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నహీద్ ఇస్లాం ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా మమతా బెనర్జీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని.. తమ మద్దతును కోల్పోలేదని చెప్పారు. అలాగే ఢిల్లీతో ఆమె కచ్చితంగా పోటీ చేయాలని.. దీదీ వెనుక తమ దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...