PM Modi: శిథిలాల నుంచి శిఖరానికి.. సోమనాథ్ 1000 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ మనోగతం

Date:

భారతీయ చైతన్యానికి, అజేయమైన సంకల్పానికి నిదర్శనమైన సోమనాథ క్షేత్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. మే 11న నరేంద్ర మోదీ సోమనాథ్‌ను సందర్శించనున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునరుద్ధరించిన ఆలయం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని రాసిన ప్రత్యేక సంపాదకీయం భారతీయ నాగరికత గొప్పతనాన్ని, విద్వంసం నుంచి సృజన వైపు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించింది. “తుఫానులు ఎంత భయంకరంగా ఉన్నా, అలలు ఎంత ఉధృతంగా ఉన్నా, గౌరవంతో తిరిగి పుంజుకోవచ్చని సోమనాథ్ తీరంలోని అలలు మనకు చెబుతాయి” అంటూ ప్రధాని తన వ్యాసంలో పేర్కొన్నారు.

2026 ప్రారంభంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని, ఇప్పుడు పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన వేళ అక్కడకు రావడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. సోమనాథ్‌ను కాపాడేందుకు, పునర్నిర్మించేందుకు శతాబ్దాలుగా కృషి చేసిన మహనీయులను ప్రధాని.

ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహారాజు ధరాసేన, రాజా భోజుడు, సిద్ధరాజ జయసింహ వంటి రాజుల సహకారాన్ని గుర్తు చేశారు. దండయాత్రల నుండి నాగరికతను కాపాడిన భీమదేవ, హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి వీరుల త్యాగాలను కొనియాడారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ ఆలయ వైభవాన్ని నిలబెట్టిన పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...