
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుపతి విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా గుర్తిస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీంతో విదేశీ భక్తులకు తిరుపతి చేరుకున్న తర్వాత వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
ఇప్పటివరకు విదేశాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులు ఈ-వీసా సంబంధిత ప్రక్రియ కోసం హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నై విమానాశ్రయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు. తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో విదేశీ భక్తులకు ప్రయాణ సమయం, ఖర్చు రెండూ తగ్గడంతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశీ భక్తులకు తిరుపతి చేరుకున్న తర్వాత వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
ఇప్పటివరకు విదేశాల నుంచి తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా హైదరాబాద్, చెన్నై లేదా బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకుని అక్కడ ఈ-వీసా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత తిరుపతికి రావాల్సి వచ్చేది. ఈ కారణంగా అదనపు ప్రయాణం, సమయం, ఖర్చు భరించాల్సి వచ్చేది.
ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో విదేశీ ప్రయాణికులకు అదనపు ప్రయాణ భారం తగ్గడంతో పాటు తిరుమల శ్రీవారి దర్శన యాత్ర మరింత సౌకర్యవంతంగా మారనుంది.
విదేశీ ప్రయాణికులు భారతదేశానికి రావడానికి ఈ-వీసా (e-Visa)ను ఆన్లైన్లోనే సులభంగా పొందవచ్చు. ఇందుకోసం భారత రాయబార కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, నిర్ణీత రుసుమును చెల్లించాలి.
ఈ-వీసా దరఖాస్తుల్లో సుమారు 95 శాతం వరకు 72 గంటల్లోనే క్లియర్ అవుతున్నట్లు సమాచారం. వీసా ఆమోదం పొందిన తర్వాత ప్రయాణికులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ అనుమతి పత్రాన్ని ప్రింట్ తీసుకుని భారత్కు రావచ్చు. ఇక్కడికి చేరుకున్న అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్పోర్ట్పై వీసా స్టాంప్ చేస్తారు.
టూరిస్ట్ వీసాతో పాటు మొత్తం 17 విభిన్న సబ్ కేటగిరీలకు కూడా ఈ-వీసా సదుపాయం అందుబాటులో ఉంది. దీంతో వివిధ అవసరాల కోసం భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు ఈ విధానం మరింత సౌకర్యవంతంగా మారింది.

