Homenewsఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

Published on

spot_img

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం కెల్ల వద్ద సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది.

సుమారుగా 8 వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశలలో ఈ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీని ద్వారా 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరాయి. ఈ సందర్భంగా కిమిడి కళా వెంకట్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడిన కిమిడి కళా వెంకటరావు.. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చీపురుపల్లి నియోజవర్గంలో 8 వేల కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గుర్ల మండలంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. కెల్ల సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం కెల్ల సమీపంలో 1,085 ఎకరాల భూమిని కేటాయించింది.

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...