అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు

Date:

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని వీరికీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు.

అంగన్వాడీలకు వర్తింపు

తల్లికి వందనం పథకం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది అందరికీ వర్తించనుంది. చాలా కాలంగా వారు కోరుతున్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.

మంత్రి సంధ్యారాణి హర్షం

ఈ నిర్ణయంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు రాష్ట్ర అంగన్వాడీ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం అంగన్వాడీ సిబ్బందిలో మరింత ఉత్సాహం, భరోసా నింపుతుందని చెప్పారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం అంగన్వాడీ సిబ్బందికి గొప్ప గుర్తింపని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తోందని ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....