
జమ్మూ కశ్మీర్లోకి పాకిస్థాన్ నుంచి వేలాది మంది ఉగ్రవాదులను చొరబాటుకు పంపినట్టు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ఈ చొరబాట్లకు పాల్పడుతోందని పాకిస్థాన్కు చెందిన ఓ మతబోధకుడు ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత్కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆదేశాలతోనే ఈ ఉగ్రవాదులను పంపినట్టు ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా, దాదాపు 10 వేల మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
జమ్మూ కశ్మీర్లోకి పాకిస్థాన్ నుంచి 10 వేల మంది ఉగ్రవాదులను పంపినట్టు ఓ పాక్ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆ ఉగ్రవాదులను పంపినట్టు ఆయన పేర్కొన్న వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల బహావల్నగర్లో లష్కరే అనుబంధ కార్యక్రమంలో మాట్లాడిన మతబోధకుడు నాసిర్ మద్నీ.. హఫీజ్ సయీద్ను మాతృభూమి సేవకుడిగా కొనియాడాడు. ఆయన వ్యాఖ్యలు కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల వెనుక లష్కరే తొయిబా, హఫీజ్ సయీద్ పాత్రపై మరోసారి చర్చకు దారితీశాయి.
అల్ఖైదా, తాలిబన్లతో సంబంధాలున్న లష్కరే తొయిబాను ఐక్యరాజ్యసమితి 2005లో ఉగ్రవాద సంస్థగా నిషేధించింది. హఫీజ్ సయీద్ను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 26/11 ముంబయి దాడులతో పాటు భారత్లో జరిగిన పలు ఉగ్రదాడుల దర్యాప్తుల్లోనూ సయీద్ పేరు వెలుగులోకి వచ్చింది.
2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కేసులోనూ హఫీజ్ సయీద్పై జమ్ము కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం, వ్యూహరచన చేయడం, అమలును పర్యవేక్షించడం వంటి అంశాల్లో సయీద్ పాత్రకు ఆధారాలున్నాయని ఎన్ఐఏ తన అభియోగాల్లో పేర్కొంది. పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

