Hyderabad: దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు!

Date:

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న స్వామి.. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లోకి వెళ్లి .. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో అక్కడి సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లగా, స్వామి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా స్వామి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు ఏమిటన్న దానిపై స్పష్టత కోసం కుటుంబ సభ్యులు, సహచరులను విచారిస్తున్నారు.

దర్యాప్తు సందర్భంగా స్వామి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కుటుంబ సభ్యుల గురించి ఆయన రాసిన కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు లభించినట్లు తెలుస్తోంది. తన మరణానికి ఎవరినీ బాధ్యులుగా చూడొద్దని, భార్యా పిల్లలను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబంపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ, తాను లేకపోయినా వారిని ఎప్పుడూ కాపాడాలనే భావనను డైరీలో వ్యక్తం చేసినట్లు సమాచారం.

నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయినా, చనిపోయిన తర్వాత దెయ్యంగా మారైనా నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆయన డైరీలో ఎంతో ఆవేదనతో రాశారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...