భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో బద్దలయిన రికార్డులు ఇవే.. 5 పరుగులు చేసుంటే వరల్డ్‌కప్ చరిత్రే మారిపోయేది!

Date:

ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026లో భారత్ జింబాబ్వేపై 256/4 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అబిషేక్ శర్మ అర్ధశతకం, హార్దిక్ పాండ్యా అజేయ ఫిఫ్టీతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మొత్తం 17 సిక్సర్లు బాది ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ స్కోర్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధికంగా నిలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్ ఆశలను బలపరుచుకుంటూ, రికార్డుల పేజీల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

సౌతాఫ్రికాపై ఎదురైన ఘోర పరాజయం మరిచిపోయేలా జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 8 కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చి చెన్నై చెపాక్ స్టేడియంలో రికార్డుల మోత మోగించారు. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 256/4 పరుగులు చేసి వరల్డ్‌కప్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మరో ఐదు పరుగులు చేసుంటే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచేది.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు, ఈ మ్యాచ్‌లో 17 సిక్సర్లు బాదింది. ఇంకొక్క సిక్స్ బాదుంటే, శ్రీలంక 2007లో చేసిన రికార్డును కూడా చెరిపేసేది. ఈ ఘన విజయానికి ప్రధాన కారణం యువ అభిషేక్ శర్మ. ఇటీవల వరుసగా డకౌట్లతో ఫామ్ కోల్పోయిన అతడు, ఈ మ్యాచ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. సంజూ శాంసన్‌తో 48 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం, ఆ తర్వాత ఇషాన్ కిషన్‌తో 72 పరుగుల జోడీతో భారత్‌కు పటిష్టమైన ఆరంభం అందించాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...