హైదరాబాద్ నుంచి నేపాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్పూర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను చుట్టిరావచ్చు. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.63,500 నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణ తేదీ, టూర్లో సందర్శించే ప్రదేశాలు, వసతి, భోజనం, రవాణా తదితర సదుపాయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నేపాల్ టూర్కు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
నేపాల్ను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. “Royal Nepal Ex – Hyderabad” పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్పూర్ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. 2026 నవంబర్ 21న హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది.
ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి విమానంలో గోరఖ్పూర్కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి లుంబినీకి ప్రయాణిస్తారు. మొదటి రోజు లుంబినీలో బస చేస్తారు. రెండో రోజు మాయాదేవి ఆలయం, వరల్డ్ పీస్ పగోడాను సందర్శించి అనంతరం పోఖారాకు బయలుదేరుతారు.
మూడో రోజు తెల్లవారుజామున సారంగ్కోట్ సన్రైజ్ పాయింట్ను సందర్శిస్తారు. అనంతరం బింద్యాబాసిని ఆలయం, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహను వీక్షించవచ్చు. ఫేవా సరస్సులో బోటింగ్ చేస్తూ పోఖారా అందాలను ఆస్వాదించవచ్చు.
ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి విమానంలో గోరఖ్పూర్కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి లుంబినీకి ప్రయాణిస్తారు. మొదటి రోజు లుంబినీలో బస చేస్తారు. రెండో రోజు మాయాదేవి ఆలయం, వరల్డ్ పీస్ పగోడాను సందర్శించి అనంతరం పోఖారాకు బయలుదేరుతారు.
మూడో రోజు తెల్లవారుజామున సారంగ్కోట్ సన్రైజ్ పాయింట్ను సందర్శిస్తారు. అనంతరం బింద్యాబాసిని ఆలయం, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహను వీక్షించవచ్చు. ఫేవా సరస్సులో బోటింగ్ చేస్తూ పోఖారా అందాలను ఆస్వాదించవచ్చు.
నాలుగో రోజు నుంచి ఏడో రోజు పర్యటన
నాలుగో రోజు పోఖారా నుంచి ఖాట్మండుకు బయలుదేరి, మార్గమధ్యంలో ప్రసిద్ధ మనోకామనా ఆలయాన్ని దర్శిస్తారు. ఐదో రోజు పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభునాథ్ ఆలయం తదితర ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆరో రోజు విమానంలో జనక్పూర్ చేరుకుని ప్రసిద్ధ జానకి ఆలయాన్ని దర్శిస్తారు. ఏడో రోజు దర్భాంగా విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
ప్యాకేజీ ధరలు
ఈ టూర్ ప్యాకేజీలో సింగిల్ షేరింగ్కు రూ.80,600, డబుల్ షేరింగ్కు రూ.68,000, ట్రిపుల్ షేరింగ్కు రూ.63,500గా ధరలు నిర్ణయించారు. బెడ్ సౌకర్యంతో పిల్లలకు రూ.56,800, బెడ్ సౌకర్యం లేకుండా రూ.41,400 చార్జీగా ఉంటుంది.
ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, 3 స్టార్ హోటల్లో వసతి, 6 బ్రేక్ఫాస్ట్లు, 6 డిన్నర్లు, స్థానిక గైడ్ సేవలు, పేర్కొన్న సందర్శనా ప్రాంతాలకు ప్రవేశ రుసుములు, ప్రయాణ బీమా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
భారతీయ పౌరులు నేపాల్ ప్రయాణానికి 6 నెలలకు పైగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ప్యాకేజీ బుకింగ్ సమయంలో 100 శాతం చెల్లింపు అవసరం. విమాన ఛార్జీలు, పన్నుల్లో మార్పులు ఉంటే అదనపు మొత్తాన్ని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

