ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!

Date:

చూస్తుండగానే జనం ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు. రాత్రి వరకు బాగున్న వాళ్లు.. తెల్లవారేసరికి వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. చందాపురంలో మొదలైన ఈ అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని కూడా చుట్టేసింది. అధికారులు హోటళ్లు మూయించారు, మాంసం అమ్మకాలు ఆపించేశారు. అయినా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతుంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ గడపను అంతుచిక్కని అనారోగ్య సమస్య వణికిస్తోంది. చందాపురం గ్రామంలో మొదలైన అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని చుట్టేసింది. ఒక్కొక్కరుగా జనం మంచాన పడుతున్నారు. వాంతులు.. విరోచనాలతో బాధితులు విలవిలలాడుతున్నారు. మొదట్లో ఒకరిద్దరితో మొదలైన ఈ అస్వస్థత. చూస్తుండగానే ఊరంతా పాకింది.

ప్రస్తుతం ఈ సంఖ్య 60కి చేరింది. బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతుండటంతో యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. చందాపురం గ్రామంలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. నందిగామ పట్టణంలోని హోటల్స్, కర్రీ పాయింట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సహా అనేక ఆహార దుకాణాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకోవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

అస్వస్థతకు గల అసలు కారణాలను గుర్తించేందుకు ఆహార పదార్థాలు, తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాంబ్‌కు పంపించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఓల్డ్‌సిటీ ప్రైవేట్‌ స్కూల్‌లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..

అయితే ఈ ఘటనపై స్కూల్‌ ఎండీ‌ మాట్లాడుతూ.. ఖురాన్‌ హోం వర్క్‌...

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...