అయ్యో దేవుడా.. కాళ్ళ పారాణి ఆరకముందే మృత్యువు వెంటాడింది.. పాపం

Date:

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంట ఆనందాన్ని రోడ్డు ప్రమాదం వేరుచేసింది. ఘోర రోడ్డు ప్రమాదంలో వధువు అక్కడే మృతి చెందగా.. వరుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్నో ఆశలతో ఇద్దరూ పెళ్లి చేసుకోగా.. వారిని అనుకోని రోడ్డు ప్రమాదం వీడదీయడంతో.

ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో సోమవారం జరిగింది.
దుబ్బాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చేప్యాలకు చెందిన సాయికుమార్‌, ప్రణతి (24) లకు ఇటీవల వివాహమైంది.

ఈ క్రమంలో ప్రణతి, సాయికుమార్ లు ఉద్యోగం నిమిత్తం సిద్ధిపేట నుంచి టూవీలర్ పై హైదరాబాద్ బయలుదేరగా. ట్రాక్టర్ అదుపు తప్పి వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వధువు ప్రణతి దారిలోనే మృతి చెందింది.

ప్రస్తుతం సాయికుమార్ కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నవ దంపతుల జీవితంలో జరిగిన ఈ విషాద ఘటనతో..ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. దీంతో చెప్యాల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...