
భారత వ్యూహాత్మక, దౌత్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో భారత్ పట్టు సాధించేలా మోదీ మూడు దేశాల పర్యటన సాగనుంది. ముఖ్యంగా వేల కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణుల డీల్, సబాంగ్ పోర్ట్ ఉమ్మడి అభివృద్ధి వంటి 5 భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాలు పర్యటనలో భాగంగా మొదటి విడతగా ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా చేరుకున్న ప్రధాని మోదీకి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో పాటు ఆ దేశ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు
. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య జూలై 11 వరకు సాగనున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఉంది. భారతదేశ దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలలో ఈ పర్యటన అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
మోదీకి అరుదైన గౌరవం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇండోనేషియా అత్యున్నత గౌరవమైన బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మోదీకి ప్రదానం చేశారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు.

