పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

Date:

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక దారుణమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 10 ఓవర్లు వేసిన గుర్నూర్.. ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో లార్డ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో 1975 లో కర్సన్ ఘావ్రి ఇంగ్లాండ్‌పై 11 ఓవర్లలో 81 రన్స్ ఇచ్చిన రికార్డును గుర్నూర్ బ్రార్ దాటేశాడు.

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఓ అవాంఛనీయ రికార్డు నమోదు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ పేసర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి మైదానంలో పూర్తిగా తేలిపోయాడు. తన కోటా 10 ఓవర్లు వేసిన బ్రార్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోగా, ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్‌లతో పాటు జో రూట్ కూడా గుర్నూర్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించారు.

ఈ దారుణమైన బౌలింగ్ ప్రదర్శనతో గుర్నూర్ బ్రార్ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా తరఫున ఒకే వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. 2015లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. 2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై వినయ్ కుమార్ 9 ఓవర్లలోనే 102 రన్స్ సమర్పించుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు 2026 లార్డ్స్ వన్డేలో 97 రన్స్ ఇచ్చిన గుర్నూర్ బ్రార్ వీరి సరసన చేరాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...