తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని పాఠశాలల చిన్నారులు ప్రధానికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించి, దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా శుక్రవారం (ఆగస్టు 28) ఘనంగా నిర్వహిస్తున్నారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలను ఆకాంక్షిస్తుండగా.. సోదరులు ప్రేమకు గుర్తుగా బహుమతులు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా రాఖీ వేడుకలు కొనసాగుతున్నాయి.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధానిని కలిసి ఆయనకు రాఖీలు కట్టారు. చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించారు. వారితో షేక్‌హ్యాండ్‌ ఇవ్వడంతో పాటు హైఫైవ్‌లు ఇస్తూ ఉత్సాహంగా గడిపారు. చిన్నారులతో ఆయన ఆత్మీయంగా మాట్లాడిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి.

రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధం, పరస్పర నమ్మకం వంటి బంధాలు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకున్నారు.

By Hemanth