Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!

Date:

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన దంపతులు ఒక్కసారిగా పరారవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.

స్థానికంగా శిరీష, సాంబశివరావు దంపతులు గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధిక రాబడులు వస్తాయని నమ్మించి కాలనీలోని మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శిరీష ‘సాయి గణేష్ టెక్స్‌టైల్స్’ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తూనే, మరోవైపు చిట్టీల వ్యాపారాన్ని కూడా కొనసాగించినట్లు తెలుస్తోంది. స్థానికుల విశ్వాసాన్ని సంపాదించిన అనంతరం భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుల వివరాల ప్రకారం.. దంపతులు తమకు చెందిన ఇంటిని విక్రయించిన అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఫిర్యాదు స్వీకరించిన అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...