మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌ భారీగా పెరిగిన చికెన్‌ ధర

Date:

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తు్న్న చికెన్‌ ధరలు.. తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతోంది. ధరలు కొండెక్కుతున్నాయి. ఆదివారం బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.340 వరకు ఉండగా, అదే వారం రోజుల కిందట కిలో చికెన్ ధర రూ.260 వరకు ఉంది.

చికెన్‌ ధరలు ఒక్కసారి పెరగడంతో సామాన్యులు కష్టంగా మారిపోయింది. ముందే యుద్దం కారణంగా ఒక్కొక్కటిగా ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చికెన్‌ ధరలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు కోడి గుడ్డు ధర మాత్రం పడిపోతున్నాయి. గతంలో ఒక గుడ్డు ధర రూ.8 వరకు ఉండగా.

ఇప్పుడు రూ.4..20 పైసల వద్ద కొనసగుతోంది. కోడిగుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో ధరలు పడిపోయాయని పౌల్ర్టీ యజమానులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లు తమిళనాడుకు తీసుకెళ్లి అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గుడ్డు ధర ఆమాంతంగా పడిపోయింది.

చికెన్‌ ధర పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్‌, ఇతర ఫంక్షన్ల కారణంగా చికెన్‌ ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు చికెన్‌ దుకాణ వ్యాపారులు. డిమాండ్‌కు సరిపడా చిన్న బ్రాయిలర్‌ కోళ్లు కూడా దొరకడం లేదట. అలాగే పౌల్ట్రీ నిర్వాహకులు పిల్లల పెంపకం ఆపేడయం కూడా మరో కారణం అంటున్నారు. కోళ్లు డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేని కారణంగా చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...