విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 25 శాతం ఖర్చు చేస్తే చాలు.. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటున్న కేశినేని నాని

Date:

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను తెరపైకి తీసుకొచ్చారు.

విజయవాడలో ప్రధానంగా బందర్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు వంటి రెండు కీలక కమర్షియల్‌ రోడ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న నాని.. ఈ నగరానికి మెట్రో రైలు అవసరమా? అనే ప్రశ్నను లేవనెత్తారు.

మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.12 వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని, నిర్మాణం పూర్తయ్యేందుకు 10 నుంచి 15 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నాని పేర్కొన్నారు. అప్పటికి ప్రాజెక్టు వ్యయం రెట్టింపై రూ.24 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు.

మెట్రో కోసం ఖర్చు చేసే మొత్తంలో 25 శాతం నిధులను విజయవాడలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తే నగరాన్ని మరింత నివాసయోగ్యంగా తీర్చిదిద్దవచ్చని నాని సూచించారు.

24/7 సురక్షిత తాగునీరు, గుంతలు లేని రహదారులు, భూగర్భ డ్రైనేజీ, వరద నివారణ, నిరంతర విద్యుత్‌, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సురక్షిత ఫుట్‌పాత్‌లు, మెరుగైన ప్రజా రవాణా వంటి సదుపాయాల అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, పార్కింగ్‌, ప్రజా మరుగుదొడ్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్‌ నిర్వహణ, ప్రజా భద్రత, అగ్నిమాపక సేవలు, పచ్చదనం, కాలుష్య నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.

మెట్రో ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం నిధులతో విజయవాడకు అవసరమైన ఈ మౌలిక సదుపాయాలను కల్పించి నగరాన్ని మరింత అందంగా, నివాసయోగ్యంగా మార్చడం మంచిదా? లేక మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడం మంచిదా? అని కేశినేని నాని ప్రశ్నించారు.

వరుసగా రెండు రోజుల పాటు మెట్రో ప్రాజెక్టుపై నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా, ఏపీ ప్రభుత్వం విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...