ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

Date:

వేసవికాలం మొదలైంది.. మార్చి నెల ప్రారంభంతోనే ఎండల తీవ్రత ఎక్కువవుతోంది. ఇప్పటికే ఉదయం 10 దాటిందంటే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ముందు ముందు మాడు పగిలే వేడి ఖాయం అన్నట్టుగానే ఉంది పరిస్థితి. వేసవి ఉక్కపోత, వేడిగాలుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తారు. అయితే, ఏసీనా లేక కూలరా? దేనిలో నిద్రపోవడం వల్ల శరీరానికి ఎక్కువ నష్టం జరుగుతుంది? AC లేదా కూలర్‌లో నిద్రపోవడం వల్ల శరీరానికి ఎక్కువ హాని కలుగుతుందో తప్పక తెలుసుకోవాలి.

ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు.

కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. కూలర్లో తేమ స్థాయి తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం , కళ్ళపై తక్కువ ప్రభావం పడుతుంది.

ఏసీ గది ఉష్ణోగ్రతను త్వరగా తగ్గిస్తుంది. కానీ, ఎక్కువ సేపు చల్లని గాలిలో నిద్రపోతే, చర్మం పొడిబారడం, గొంతు ఎండిపోవడం, ముక్కు బ్లాక్ అవడం, కండరాల నొప్పులు, కొందరికి సైనసైటిస్ సమస్యలు వస్తాయి. అలాగే గది పూర్తిగా మూసివేసి ఉంటే తాజా గాలి రాకపోవడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఉష్ణోగ్రతను 24–26°C మధ్య ఉంచడం మంచిది.

ఎయిర్ కూలర్ నీటిని ఆవిరి చేసి గాలిని చల్లబరుస్తుంది. ఇది సహజ చల్లదనాన్ని ఇస్తుంది. అయితే గదిలో తేమ (Humidity) పెరుగుతుంది. అలెర్జీ ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తుంది. ఆస్తమా రోగులకు సమస్యలు. సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరుగుదల, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూలర్ వల్ల చెమట, అసౌకర్యం కలగవచ్చు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...