
సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్రెడ్డి భార్య విజయలక్ష్మి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు వల విసరగా.. రూ.10.91 లక్షలు పొగొట్టుకున్నారు. దీంతో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమె బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగం కావటం గమనార్హం.
సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్దతుల్లో బురిడీ కొట్టిస్తున్నారు. అయితే వీరి వలలో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు, వర్గాలకు చెందిన వారు కూడా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సైబర్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి రూ.కోట్లు కొట్టేశారు. బంగారం సైతం తాకట్టు పెట్టి ఆమె పెట్టుబడులు పెట్టింది. తాజాగా.. సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్రెడ్డి సతీమణి సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో వచ్చిన ఫేక్ పెట్టుబడుల వీడియో ప్రకటన చూసి ఆయన భార్య బీవీ విజయలక్ష్మి రూ.10.91 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ వెంటనే సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మి బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేయటం గమనార్హం. గతేడాది డిసెంబరులో సామాజిక మాధ్యమాల్లో నిర్మలా సీతారామన్ పేరుతో ఒక పెట్టుబడి ప్రకటన చూశారు. సెబీ ఆధ్వర్యంలో ట్రేడింగ్లో పెట్టుబడులకు అవకాశముందని నమ్మించారు. క్వాంటాపల్స్ సంస్థ ఇందుకు సేవలు అందిస్తోందని చెబుతూ ప్రకటన కింద ఉన్న లింక్ ఉంచారు. విజయలక్ష్మి లింక్ మీద క్లిక్ చేయగా.. ఆర్థిక సలహాదారు ఆదిత్య సుబ్రహ్మణ్యం పేరుతో వాట్సాప్లో విజయలక్ష్మికి ఒకరు పరిచయమయ్యారు.

