Homenewsతెలంగాణ: ఆదివారం స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లాడు.. కాసేపటికే విగతజీవిగా

తెలంగాణ: ఆదివారం స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లాడు.. కాసేపటికే విగతజీవిగా

Published on

spot_img

ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈ యువకుడు పిక్‌ నిక్‌కు వెళ్లాడు. దగ్గరలోని వాగుకు వెళ్లారు. ఇక అందరూ కలిసి అందులో ఈతకు దిగారు. అయితే ఈ యువకుడు కాసేపటికే విగతజీవిగా తిరిగొచ్చాడు. ఆపై ఏం జరిగింది.? ఈ వార్తలో చూసేద్దాం మరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు.

ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లి వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి గుమ్మళ్ళ యశ్వంత్(15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. మనవడిపై గారాబం పెంచుకున్న నాయనమ్మ మనవడి మృతదేహం చూసి రోదిస్తూ గుండెపోటుతో చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.

అశ్వారావుపేటకు చెందిన ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు ఆంధ్రా సరిహద్దుల్లోని సంగమం వాగు వద్దకు వెళ్లారు. వాగు వద్ద ఆటలు ఆడుతూ అందరూ వాగులోకి స్నానానికి దిగగా.. ఇద్దరు బాలురు మునిగిపోయారు. వాగు లోతు అంచనా వేయకుండా వీరు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో ఇద్దరూ మునిగిపోయారు.

ఒక బాలుడు సురక్షితంగా బయటపడగా. గుమ్మళ్ళ యశ్వంత్ అనే బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు వచ్చి వాగులో గాలించగా యశ్వంత్ మృతదేహం లభించింది. మృతి చెందిన యశ్వంత్ అశ్వారావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవతరగతి చదువుతుండగా, ఆదివారం పిక్‌నిక్ అని వెళ్ళిన తమ కుమారుడు జీవచ్చవంగా ఇంటికి చేరడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఎంతో గాారాబంగా చూసుకున్న తన మనవడి మృతదేహాన్ని చూసి రోదిస్తూ నాయనమ్మ ఎంకులమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...