Homenewsఏపీలో దర్శనమిచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం 33 అడుగుల పొడవు రూ.3 కోట్లు ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారంటే

ఏపీలో దర్శనమిచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం 33 అడుగుల పొడవు రూ.3 కోట్లు ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారంటే

Published on

spot_img

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ హైవే మీద ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా శివలింగం దర్శనం ఇచ్చింది. 33 అడుగుల పొడవుతో.. 210 టన్నుల బరువున్న భారీ రాతి శివలింగాన్ని చూసి శివయ్య భక్తులు మురిసిపోతున్నారు.

ఈ శివలింగాన్ని దర్శించుకున్నందుకు తమ జన్మ ధన్యం అయ్యింది అంటున్నారు. మరి ఇంత భారీ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు.. ఎక్కడ రూపుదిద్దుకుంది.. ఎంత ఖరీదు అయ్యింది వంటి ఆసక్తికర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ శివలింగాన్ని బిహార్‌లోని చంపారన్ జిల్లాలో ప్రతిష్ఠించనున్నారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి చంపారన్ తరలిస్తున్నారు. 114 టైర్లున్న భారీ హైడ్రాలిక్ ట్రక్కు మీద ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆళ్లగడ్డ హైవే మీద ఈ భారీ శివలింగం దర్శనం ఇచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఏపీలో దర్శనం ఇచ్చిన అత్యంత ఎత్తైన శివలింగం అంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఈ శివలింగం సుమారు 33 అడుగుల పొడవు ఉంది. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం విలువు రూ.3 కోట్లు. మహాబలిపురం నుంచి బిహార్ చేరడానికి దాదాపు 20-25 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. శివలింగం బరువును దృష్టిలో ఉంచుకుని దీన్ని తరలించడానికి.. 114 టైర్లున్న హైడ్రాలిక్ ట్రక్‌ని వినియోగిస్తున్నారు.

ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం పర్యవేక్షణలో.. ఈ భారీ శివలింగాన్ని బిహార్ కు తరలిస్తున్నారు. శివలింగాన్ని ప్రతిష్టించబోయే విరాట్ రామాలయం ఎత్తు… కంబోడియాలోని 12వ శతాబ్దపు అంగ్కోర్ వాట్ ఆలయం కన్నా మరింత ఎత్తుగా ఉండేలా డిజైన్ చేసి నిర్మిస్తున్నారు.

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...