
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని నర్కూడ గ్రామంలో.. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల ఆ గ్రామానికి ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా.. గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలి
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్నారు మహాత్మ గాంధీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆ గ్రామాలే పునాది. గ్రామం స్వయం సమృద్ధి సాధిస్తేనే.. దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ గ్రామ పాలనలో అత్యంత ప్రధానమైనవి గ్రామపంచాయతీ ఎన్నికలు. ఈ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే సర్పంచ్తో పాటు వార్డు సభ్యులది.. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర. వారు సమర్థంగా పనిచేస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర గుర్తులతో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి.
