ఏందయ్యా ఇదీ..! Google మ్యాప్‌ను నమ్మితే.. నేరుగా గోతిలో పడ్డ కారు

Date:

గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. తిరుపతి జిల్లాలో లింగసముద్రం వద్ద రహదారి డైవర్షన్ చేసినప్పటికీ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ నేరుగా గోతిలోకి వెళ్లాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా, స్థానికులు అతడిని రక్షించి చికిత్స కోసం తరలించారు..

 తిరుపతి జిల్లాలో గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు.. వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు గాయాలు కాగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. వివరాల ప్రకారం..

తిరుపతి జిల్లాలో వెంకటగిరి నుంచి డక్కిలి వైపు ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తున్నాడు. ఏర్పేడు–పెంచలకోన జాతీయ రహదారిలోని లింగసముద్రం వద్ద వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ రహదారిని మళ్లించి డైవర్షన్ ఏర్పాటు చేశారు. అయితే డ్రైవర్ గూగుల్ జీపీఎస్‌ను ఆధారంగా చేసుకుని ప్రయాణిస్తుండగా, మ్యాప్ చూపించిన మార్గంలోనే నేరుగా వెళ్లాడు. ముందున్న రహదారి పరిస్థితిని గమనించకపోవడంతో వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స కోసం తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు డైవర్షన్‌కు సంబంధించిన హెచ్చరిక బోర్డులు లేదా సూచికలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే...

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు కారణం ఇదే!

బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం...

మళ్లీ తెర పైకి జమిలి!

హైదరాబాద్‌, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో...

శ్రావ‌ణమాసం మూడో శుక్ర‌వారం రోజున పార్టీని ప్ర‌క‌టిస్తా : విజయసాయిరెడ్డి

విజయవాడ: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ...