
ఐపీఎల్లో తన బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.
నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ కాగా.. ఈస్ట్ జోన్ 467 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.
రెండో ఇన్నింగ్స్లోనూ నార్త్ ఈస్ట్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 27వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ స్పిన్నర్ వైభవ్ తన ప్రభావం చూపించాడు.
ఓవర్ రెండో బంతికే కిషన్ లింగ్డోను 25 పరుగుల వద్ద ఔట్ చేసిన వైభవ్.. ఐదో బంతికి ఇమ్లివాటి లెమూర్ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా మూడు ఓవర్లు వేసిన వైభవ్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్లో మాత్రం ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులకే ఔటయ్యాడు.
మరోవైపు నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్లో ఇప్పటికే సత్తా చాటిన వైభవ్.. ఇప్పుడు బౌలింగ్లోనూ తనలోని మరో కోణాన్ని చూపించడం విశేషం.

