ఏపీలో పత్తి రైతులకు శుభవార్త.. ఇప్పుడు జిన్నింగ్‌ మిల్లుల్లోనూ కొనుగోలు.. తేమ 18 శాతం ఉన్నా

Date:

పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు 64 జిన్నింగ్‌ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లోనూ రైతులు పత్తిని అమ్ముకోవచ్చు. కాగా, తేమ 18 శాతం ఉన్నా.. తడిసిన, రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా, తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ డిమాండ్ చేశారు

రాష్ట్రంలోని పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 11 మార్కెట్‌ యార్డులతో పాటు 64 జిన్నింగ్‌ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటివరకు 19 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా.. 72,240 క్వింటాళ్ల పత్తి సేకరించామని వెల్లడించారు. ఈ సందర్భంగా పత్తి రైతుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా గతంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు వినతిపత్రం కూడా పంపించామన్నారు. తమ వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...