
ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా భావిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మరో అప్ డేట్ వచ్చింది. అమరావతి ఓఆర్ఆర్ ఐదు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల 3ఏ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాల 3ఏ వివరాలకు NHAI, మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలు కూడా ఆమోదం పొందితే అభ్యంతరాలు తెలుసుకునేందుకు పత్రికా ప్రకటన జారీ చేస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు(ORR) సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఐదు జిల్లాల పరిధిలో చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని జిల్లాల నుంచి 3ఏ ప్రతిపాదనలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వద్దకు చేరాయి. దీంతో అన్ని జిల్లాలకు సంబంధించిన 3ఏ నోటిఫికేషన్ వివరాలను జాతీయ రహదారుల సంస్థ అధికారులు పోర్టల్లో నమోదు చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గుంటూరు. కృష్ణా, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నిర్మించనున్నారు.
