
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. పుణెకు చెందిన సంస్థ రూ.74.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు తాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అలాగే, తిరుపతిలో వైభవంగా జరిగిన కార్తీక మహాదీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని సామూహిక దీపారాధన చేశారు. ధర్మగిరి వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేసింది.
తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు శ్రీవారికి తమకు తోచిన విధంగా కానుకలు అందజేస్తుంటారు. కొంతమంది భక్తులు బంగారం, వెండి వంటివి ఇస్తారు. కొందరు భక్తులు టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందజేస్తారు. ఇంకొందరు వాహనాలను టీటీడీకి విరాళంగా అందజేస్తుంటారు. ఈ వాహనాలను టీటీడీ ఆయా అవసరాలకు తగిన విధంగా ఉపయోగిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు బస్సును అందజేశారు
