పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!

Date:

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో నెలకొన్న విషాద ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా నిలిచిన వృద్ధ దంపతులు 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ మరణంలోనూ విడిపోలేదు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న భర్త మల్లప్ప ముందుగా కన్నుమూయగా, ఆ వియోగాన్ని తట్టుకోలేక భార్య లింగమ్మ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి ప్రాణాలు విడిచారు. తొమ్మిది పదుల వయస్సులోనూ ఒకే రోజు, ఒకే సమయంలో తనువు చాలించిన ఈ ఆదర్శ జంటను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెళ్లి నాడు ఏడడుగులు నడిచేటప్పుడు సుఖదుఃఖాలలోనే కాదు, మరణంలోనూ తోడుంటామని ప్రమాణం చేస్తారు. కానీ, ఆ మాటను నిజం చేస్తూ, మరణంలోనూ కలిసే ప్రయాణించిన ఒక అరుదైన జంట ఉదంతం శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగుచూసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా జీవించిన ఆ వృద్ధ దంపతులు, మరణంలోనూ విడిపోలేక ఒకే రోజు, ఒకే సమయంలో కన్నుమూశారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ దంపతులు దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లప్ప ఆరోగ్యం క్షీణించడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

దశాబ్దాలుగా తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, ప్రాణంగా చూసుకున్న భర్త ఇక లేడనే చేదు నిజాన్ని భార్య లింగమ్మ తట్టుకోలేకపోయారు. కళ్లముందే భర్త నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆమె గుండె పగిలింది. ఆ తీవ్ర బాధను జీర్ణించుకోలేక, భర్త మరణించిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె కూడా ఒక్కసారిగా గుండె ఆగి అక్కడికక్కడే కన్నుమూశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...